Aug 26, 2010

కరుకుగా గరుకుగా కాకరలా

"అతను కూడా అందరిలా ఎందుకుండడు? విరాగిలాగున్నాడే ! ఎప్పుడూ తీవ్రమైన ఆలోచనలో ఉండడమెందుకు ?వీడి వయస్సుకీ నడవడి ఒప్పదు," అని అమ్మ అనుకొనేది.
అంతలోనే "ఏ పిల్లతో నైనా ప్రేమలో పడ్డడేమో !" అనుకొనేది.
త్వరలోనే అమ్మ గ్రహించింది. " తన కొడుకు ఫ్యాక్టరీలో ఉండే ఇతర యువకుల్లాంటి వాడు కాడు. కానీ," అమ్మలో సంశయం,సందేహం,ఆందోళన.
'అస్పష్టమైన ఆలోచనలతో పెరుగుతున్న సంకోచాలతో చిత్రమైన మౌన జీవితంతో 'ఒకరోజు రెండులు కాదు రెండేళ్ళు గడిపారు తల్లీకొడుకులు!
ఈ క్రమం లో ఒకరినొకరు గుర్తించారు.గౌరవించారు..ప్రేమించారు.
కొడుకు అందించిన కరదీపికను తల్లి అందుకొని -ముందుకు నడిచింది.నడిపించింది.
ఇది సులభం కాదు.
అందులోను నూరేళ్ళ నాడు !
అందుకేనేమో ,మమతానురాగాలనే సాయుధాలుగా మలిచాడు గోర్కీ.
"బహుశా  ఇలాంటి పనికి కొడుకును అనుసరించిన తల్లులలో ఈమె మొదటిదేమో .."అంటాడు రీబిన్.
"జీసస్ కీర్తి కోసం ప్రాణాలర్పించే మనుషులే లేకపోతే ,జీసస్ ప్రభువే అయి ఉండి ఉండడు !"అంటుంది అమ్మ తన హృదయాంతరాళంలోంచి పుట్టుకొచ్చిన కొత్త భావంతో .
నవల ఆరంభం లోని అమాయకమైన వ్యక్తి కాదు నీలోవ్నా .నవలతో పాటు ఆమెలోను గొప్ప పరిణామం కలుగుతుంది.ఆమెతో పాటు మనకూ.
పావెల్ సాషాలను ముచ్చటైన జంటలా చూడాలని ఎంత సహజంగా కోరుకుంటుందో కొడుకు ఉద్యమ పరిణామాలను ,సుధీర్ఘ ప్రవాస జీవితాన్ని ఎదుర్కోవడాన్ని అంతే గంభీరంగా నిలబడుతుంది.
అక్షరజ్ఞానం లేని అమ్మ ఒక ఆదర్ష నాయికగా ఆవిర్భవించే క్రమంలో , సాషా,నతాషా,లుద్మీలా,నికొలొయ్,ఇవాన్,రీబిన్ ..లాంటి వారందరితో ప్రభావితం అయ్యింది.వారినీ ఆమె ప్రభవితం చేసింది. ఇది ఆధునిక పోకడ.
***
ఒక పాల పుంతకు లేద ఒక ఆధునిక విమానానికి గోర్కీ నామకరణ చేయడం ..ఊళ్ళకు వీధులకు భవనాలకు గోర్కీ పేరు పెట్టి పిలవడము ..ఇవ్వాళ మనం విషేషాలుగా భావించ వచ్చు.అవన్నీ నవీన రష్యా చరిత్రలో నామ రూపాలు మిగలకుండా మలిగిపోయి ఉండవచ్చు.
సామాన్య ప్రజానీకం లోనుంచి గొప్ప రచయితగా ఎదిగిన వ్యక్తి గానో ..బోల్ష్విక్కులకు సన్నిహిత మిత్రుడిగానో ..సోషలిస్ట్ రియలిజం ప్రతిపదించిన సాహితీదార్షనికుడిగానో ..పాశ్చ్యాత్య విమర్షకులు తొసిఒపుచ్చిన ఆదర్షవాదిగానో ..ఎ ఒక్క రూపంతోనో ..మనం గోర్కీనీ స్మరించుకుంటే సరిపోదు.
ఆధునిక రష్యా జీవితం లోని సంక్లిష్టమైన నైతిక వర్తనను గుర్తించిన తొలి రచయితగా ప్రపంచం గొర్కీని గౌరవిస్తుంది.
ఇక,  విప్లవం రేకెత్తించిన ఆశలనూ ,చూపిన అద్బుత ఫలితాల్లోని పరిమితులనూ ..విప్లవ పథంలో కనబడని సున్నిత నైతికప్రమాదాలనూ ..ఎంతో ముందుగా ..ఎంతో సునిశితంగా గుర్తించిన మేధావిగా గోర్కీని మనం గుర్తించక తప్పదు.
ఇలా చూడండి.
"ఇవ్వాళ  పెట్రోల్ చక్రవర్తులు, ఉక్కు చ్క్రవర్తులు ,ఇంకా అలాంటి బోలెడు మంది చక్రవర్తులు లూయి- xi కంటే లేదా ఇవాన్ ది టెర్రిబుల్ కంటే ఎంతో దుర్మార్గులూ ,నేరస్తులూనూ.."
" సోషలిష్ట్ నిర్మాణపు సర్వరంగాల్లోనూ అంతటి ముఖ్యమైన పాత్ర నిర్వహిస్తున్న సోవియట్ మహిళని తగినంత వివరంగా చిత్రించడం అనేది నాటకం కానీ నవల కానీ చేయ లేదు."
ఈ ఆధునిక భావాల వయసు డెబ్భై ఏళ్ళ పై మాటే !
ఇన్నెందుకు?
గోర్కీని అజరామరం చేయడానికి ?
అనేకుల అంతరాంతరాలలో ఇంకిపోయిన మన "అమ్మ" చాలదా?
వెయ్యేల?
***
గోర్కీ అన్న పదానికి అర్ధం చేదు.
కల్లిబొల్లి కల్పనలు లేని వాస్తవం కరుకుగా గరుకుగా కాకరలా..
చేదుగానే ఉంటుంది. 
చక్కెర పూసిన అసత్యం తియ్యగానే ఉంటుంది.
"అమ్మ" అందుకు తిరుగుడు లేని విరుగుడు!
అమ్మ కు ఓ నూలు పోగు . 
అభిమానం తో.
 *


రచన 1-3-2007 .నూరేళ్ళ అమ్మ, ప్రజాసాహితి వారి ప్రత్యేక సంచిక నుంచి మరికొంత .
*

 All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Aug 24, 2010

అలలు అలలుగా

అమ్మ రచనాకాలంలో ఎవరిని ఉత్తేజ పరిచిందని మనం భావించామో వారు, ఆనాటికి అంతగా అక్షరజ్ఞానం అబ్బని వారు. కానీ, అనతి కాలంలోనే అనేక కళారూపాలలో "అమ్మ" అన్నివైపులా ఆవరించి పోయింది. అందరి హృదయాలను స్పృశించ  గలిగింది.
బెర్నాల్డ్ బ్రెట్చ్  అమ్మ నాటక రూపాంతరం , నాటికీ గొప్ప ప్రజాదరణను పొందుతూ ,సామాన్యులకు ప్రేరణగా నిలుస్తుంది .ఆనాటి నుంచి  ఆ మధ్యన  జరిగిన వియత్నాం యుద్ధ వ్యతిరేక ఉద్యమాల వరకూ .ప్రపంచంలో ఏదో ఒక చోట అమ్మ స్వరం వినిపిస్తూనే ఉంది . అలలు అలలుగా.
అమ్మలో అంతటి శక్తి ఎక్కడిదిమనల్ని తన వైపు  అలా ఆకర్షించేస్తుందేం  ?
నూరేళ్ళ ముదిమి వయస్సులోనూ అమ్మ చలాకీ గా చురుక్కు మనిపిస్తుందే !
ఒక అమ్మలా ఆలోచించినప్పుడు ఆ ప్రత్యేకత ఏమిటో కొంత తెలియ వచ్చినట్లే అనిపించింది.
అమ్మ అందరి అమ్మలాంటిదే.
బిడ్డ ఆకలి తీర్చనిదే తన నోట ముద్ద పెట్టలేని మాములు అమ్మ.
తన బిడ్డ సుఖం గా హుందాగా భద్రంగా జీవించాలని కోరుకొనేదే. తల బొప్పి కడితే తల్లడిల్లి పోయేదే. కన్ను ఎర్ర బడితే విలవిలలాడి పోయేదే.
ఈ అమ్మ మహత్తరశక్తి లా మూర్తీభవింపజేసి మన ముందు నిలిపిన మేధావి గోర్కీ - ఈ మాములు అమ్మను ,మనందరి లాంటి అమ్మను,తన కన్న బిడ్డ మీద సహజంగా వ్య్క్తపరచ గలిగే మమతానురాగాలను -ఏ తల్లి కన్నబిడ్డపైననైనా ప్రసరిచ గల మహోన్నతవ్యక్తిత్వంగా మలిచాడు. ఆ శక్తి తల్లి తన బిడ్డల మధ్య సోదర భావాన్ని కల్పించి,సమన్వయాన్ని కలిగించి,ప్రేమతో కట్టిపడేసే అమ్మ మన్సుది.
మానవ స్వభావాన్ని బాగా ఎరిగిన వాడు కాబట్టే ,గోర్కీ అమ్మలోని మానవి ని చూడగలిగాడు. మనకు చూప గలిగాడు.
స్వేచ్చ సమత  సౌభ్రాతృత్వాలతో విలసిల్లే ఆ మరో ప్రపంచపు కలను మనముందు ఆవిష్కరించ గలిగాడు.
సమదృష్టి ,సామాజిక దృక్పథం,చైతన్య సంస్కారం- అమ్మ రచనా కాలంతో పోల్చి చూస్తే , ఎంతో సూదూర ఆదర్షప్రాయంగానే తోచ వచ్చు.సమకాలీనత ప్రశ్నార్ధకం కావచ్చు.
అయితే, అమ్మ లోని తల్లీకొడుకులు రచయిత ఊహాచిత్రణ కారని మనకు తెలుసు. అలాగే, అక్షరబద్దం చేయక పోయి ఉంటే ,అనేకమంది సామాన్య కార్యకర్తల్లో ఒకరిలా వారూ కాలం లో కలిసి పోయి ఉండే వారేమో !
నమ్మిన సిద్ధాంతం కోసం సర్వం ధారపోసిన సామాన్య కార్యకర్తల జీవితం "అమ్మ"
అందుకే అమ్మ ప్రత్యేకమైనది.అది ఏ రూపంలోని ఉద్యమమైనా,సాధారణ వ్యక్తుల గుండెను తడిమి చూపుతుంది,అమ్మ.  భుజం తడుతుంది అమ్మ.
బాంధవ్యాలు మనిషిని సున్నితంగా కట్టివేసి ఉంచుతుంటాయి.మానవ సంబధాలు మనిషి ఆలోచనలనూ అనుభూతులనూ ప్రభావితం చేస్తాయి.కొండొకచో,దిశానిర్దేశం చేస్తాయి.
అమ్మ లో ఈ సున్నిత బంధాలను బలీయమైన లక్ష్యం వైపు పరివర్తన చెందేలా చిత్రించడంలో గోర్కీ ఎంతో ప్రణాళికా బద్దమైన కథనాన్ని ఎంపిక చేసుకొన్నాడు.రచనా విధానాన్ని దగ్గరగా చూసిన కొద్దీ - చాలా అద్బుతంగా తోస్తుంది.
అమ్మ అన్ని మమకారాలకు ఆది.ప్రేమ స్వరూపిణి.కారుణ్యమూర్తి.అమ్మలో బిడ్డలను లాలించే పాలించే శక్తి సహజంగానే ఉంది.ఆ సున్నితమైన శక్తితోనే, తండ్రిని అనుకరించ బోయిన పావెల్ ను సరియైన మార్గం అన్వేషించేలా చేయగలిగింది అమ్మ.
ఆమె సునిశిత పరిశీలనాశక్తి ,చిన్ని చిన్ని మాటలు ,కొడుకు పావెల్ కు  దిశానిర్దేశం ఎలా అయ్యాయో ..తన ఈడు వారందరిలో ఒకడిగా మిగిలి పోకుండా
ఒక నాయకుడిలా ఎలా ఎదిగాడో ...చాలా సహజమైన సంభాషణల్లో సంధర్భాలలో సంఘటనల్లో చిత్రించాడు గోర్కీ .
తల్లి సహజ సిద్ధ ఆరాటం ..తనయుడు పోరాట మార్గం వైపు మళ్ళిన తీరు - ఈ నడుమ తల్లీ కొడుకులు పరస్పరం అంది పుచ్చుకొన్న ఆలోచనా స్రవంతి - చాలా నేర్పుగా మెళుకువగా అక్షరబద్దం చేసాడు గోర్కీ.అమ్మలో పరిణితి కలుగుతున్న కొద్దీ, కుటుంబ బంధాలను సమాజగతం చేస్తూ, నూతన మానవ సంబంధాలను ఆవిష్కరించుకొంటూ వస్తుంది.
ఇందులో రెండు ముఖ్యమైన అంశాలు ఉన్నయి.
ఉద్యమ కాలంలో తల్లీ బిడ్డల మమతానురాగబంధాలకు అతీతమైన కర్తవ్యమార్గం చూపే ప్రయత్నం ఒకటైతే ,ఇక కుటుంబానికే పరిమితమైన అమ్మ స్వయంగా సామాజిక ఉద్యమాలలో పాలు పంచుకోవడం రెండవది.
కార్మికులు ,కర్షకులు, స్త్రీలు ,వివిధ ప్రాంతీయులు -ఏకతాటిన ఉద్యమమార్గాన నడవడం ..ఈ నవల అందించే ముఖ్య సందేశం.
అదే నవలకు ఉద్యమ స్పూర్తినిచ్చింది.
నవల ఉద్యమానికి స్పూర్తినిచ్చింది.
***
రచన 1-3-2007.
నూరేళ్ళ అమ్మ, ప్రజాసాహితి వారి ప్రత్యేక సంచిక నుంచి ఇంకొంత.
 All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Aug 21, 2010

అమ్మ కో నూలు పోగు !

"సరిగ్గా సమయానికి వచ్చిన నవల !" అంటూ లెనిన్ ప్రశంసలు అందుకొన్న "అమ్మ"- 
సరిగ్గా ఉద్యమ సమయానికి సాయుధంగా అంది వచ్చిన విషయం అందరికీ తెలుసు.
"నేను దీనిని అమెరికా లో ఉండగా ,హడావుడిగా తగినంత సమాచారం అందుబాటులో
లేనపుడు రాశాను- అంటూ శిల్ప నిర్మాణపు అమరికల గురించి గోర్కీ   వివరించబోతుంటే -
లెనిన్ సాలోచనగా తలూపి అన్నాడు," హడావుడిగా రాసి నువ్వు మంచి పని చేశావు.ఇప్పుడు ఇది చాలా అవసరమైన పుస్తకం!"
అలా ,ప్రపంచం ముందు అమ్మ ఉద్యమ సాహిత్యం లా ఆవిష్కరించ బడింది.
ప్రపంచచరిత్రలోనే  ఒక ముఖ్యమైన విప్లవఘట్టానికి కరదీపికలా ఉపయోగపడింది.
సామాన్యుల సంకోచాలను ,సందిగ్దాలను,సందేహాలను సున్నితంగా సమాధాన పరుస్తూ - ఒక సమోన్నత ఆశయాన్ని ఆవిష్కరించింది.మేధావి మాక్సిం గోర్కీ కలం సాధారణ జీవితాలను స్పృశించింది.వారిలో ఒక కొత్త ఉత్తేజాన్ని ఉద్వేగాన్ని కలిగించింది. ఉద్యమం వైపు మళ్ళించింది.
ఉద్యమకారులకీ సాహితీవేత్తలకీ అమ్మ ఒడి తొలి బడి అయ్యింది. మునుముందు ,గోర్కీ పరిపూర్ణంగా ప్రతిపాదించబోయే "సోషలిస్ట్ వాస్తవికత" కు అమ్మ ఆరంభం అయ్యింది.
అటు రచయితనూ ఇటు పాఠకులనూ ఒక నూతన దృక్పథం వైపు అమ్మ వేలు పట్టి నడిపించింది.నడిపిస్తూనే ఉంది. అందుకే ,అది అన్ని విధాలా సరియైన సమయం! సంధర్భం!!
***
అమెరికాలోని అడిరాన్ డాక్ పర్వతశ్రేణిలో  ప్రవాస జీవితం గడుపుతూ ,అమ్మ కు ప్రాణం పోశాడు గోర్కీ.
విప్లవకారుడైన కొడుకు భావాల బాటలో నడుస్తూ - సోషలిజాన్ని మతస్పూర్తితో కొనసాగించడం  అమ్మ కు సహజం  గానే అబ్బింది.
"పునరుత్థానమైన ఆత్మను చంప లేరు !"అమ్మ తేల్చి చెప్పింది తనలాంటి వారితో ,వారి బిడ్డలతో మమేకమవుతూ.
"నాయాలారా వినండి.దేవుని పేరు తలుచుకొని వినండి!మీరంతా చాలా మంచి వాళ్ళు.అత్మీయులైన నాయనలారా! జరిగిన సంగతులు చూడ్డానికి భయపడకండి! సాక్షాత్తు మన పిల్లలు -మన రక్తంలో రక్తమైన పిల్లలు అందరికీ సమానంగా న్యాయం జరగాలనే సంకల్పంతో కొత్త ప్రపంచంలో పడ్డారు.సత్యమూ న్యాయమూ గల మరొక జీవిత విధానాన్ని వాళ్ళు అన్వేషిస్తున్నారు.జనానికందరికీ వాళ్ళు మంచిని  కోరుతున్నారు!"
ఇంత లోతుగా మాట్లాడిన అమ్మ -ఆనాటి అందరు సామాన్య స్త్రీల లాగానే అక్షరజ్ఞానం లేని అణిగి మణిగి ఒదిగొదిగి ఉండే గృహిణి. మాములుగానే.
మరి, ఆమె మాటల్లో ఇంతటి ఆవేశం ఎందువల్లనో ,ఆమె విశ్వాసం చేత నిబ్బరంగా నిలబడగలిగిందో ..ఆమె మాటల్లోనే ."వాళ్ళు సత్యాన్ని బయటపెట్టేరు.అందుకే వారు బాధలను అనుభవిస్తున్నారు.వాళ్ళలో విశ్వాసముంచండి!"
అందుకే అచంచల విశ్వాసం తోటే ,అమ్మ గంభీరంగా అంటుంది ,"రక్త సముద్రం కూడా సత్యాన్ని ముంచేయ లేదు!"
నిజం!
గోర్కీ ని మరింత సన్నిహితంగా తెలుసుకోవడానికి ,అర్ధం చెసుకోవడానికి ఇవ్వాళ ఇనుప గోడలు లేవు .ముళ్ళకంచెలు లేవు.
అమ్మ తో ప్రపంచ ప్రసిద్ధమైన గోర్కీ మేధో ప్రస్తానం "అధోజనం" "మధ్య తరగతులు"అన్న ప్రసిద్ధ నాటకాల మీదుగా సాగి -"అసందర్భ ఆలోచనలు (1918),కొత్త జీవితం (Navya Zhizn ,New Life)పత్రికలో కొనసాగి - "అర్టమోం వాణిజ్యం (1925) వరకూ విస్తరించింది.
నడుమ చేసిన అనేక రచనల బాటలోఒక మానవ దృక్పథ అన్వేషణ లా కొనసాగింది.
ఈనాడు గోర్కీ కేవలం ఉద్యకారుడిగానో లేదా సాహిత్య కారుడిగానో పరిమితం కాడు.సత్యాన్వేషణలో అన్ని అవరోధాలనూ అధిగమించి నిలబడ్డ ఒక ఉన్నత మానవుడిగా నిలబడతాడు.
అందుకు ఓనమాలు ఆయన అమ్మ" లోనే దిద్దాడు.1935 లో గోర్కీ పరిపూర్ణంగా ప్రతిపాదించిన
సోషలిష్ట్ రియలిజం సాహిత్య సిద్ధాంతానికి మూలాలు అమ్మలోనే ప్రభవించాయి.
అమ్మ అటు రచయితనూ ఇటు పాథకులనూ ఒక ఉత్తేజ భరిత తరంగం లా ముణ్చెత్తింది. తరంగ ధైర్ఘ్య ప్రభావం శతాబ్ద కాలం ప్రకంపిస్తూనే ఉంది .ఇంకా ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి.

***
(1-3-2007)( నూరేళ్ళ  అమ్మ ,ప్రజాసాహితి ప్రత్యేక సంచిక నుంచి కొంత)


 All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

ఇది చూశారు కదా?

దీనిని చూడండి.
వీలైతే కాస్త వివరం గా చూడండి.


ఇప్పటికే చూసి ఉంటే , మరో సారి చూడండి.
Thanks to Greenpeace India.
                 ***
.
Bt Brinjal could be back. The Biotechnology Regulatory Authority of India (BRAI) bill has been approved by the Cabinet and will be tabled in the Parliament soon.

The BRAI bill will clear genetically modified (GM) crops overriding the concerns raised by the general public and state governments against GM food. The Cabinet cleared this bill in a hurried and hushed fashion, denying people a chance to voice their opinion.


If passed, this bill will also allow BRAI to escape the purview of Right to Information. The public will be unable to stop genetic contamination of rice or 56 other crops whose GM versions are in the pipeline. 

Time is short. The bill can be tabled in the Parliament any day. Sign the open letter now to save your food from contamination:

http://greenpeace.in/safefood/change-brai-bill-stop-gm-food-india

Thanks a billion!

Jai Krishna
Jai Krishna 
Sustainable Agriculture Campaigner
Greenpeace India 





వారానికి ఒక మారు. ప్రతి శుక్రవారం. తప్పితే ఆ మరునాడు ! All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Aug 14, 2010

"బోలో స్వతంత్ర భారత్ కీ...

జై" అనీ అనగానే, 
"జై !"అనే వాళ్ళం పిల్లలమంతా.
ఒక్క గొంతుతో.
ప్రభాత్ ఫేరీలు చుడుతూ.
ఊరంతా.
"లెఫ్ట్ రైట్... లెఫ్ట్ రైట్ ...
లెఫ్ట్ టర్న్ ..రైట్ టర్న్ ...
పీచే ముడ్.. దాయే ముడ్ ..బాయే ముడ్ ..  సావధాన్ ... ఆగే చల్ .."
అని అంటూ పిటి సార్  ఆగి ఆగి వేసే...విజిళ్ళ మధ్యన.
ఆగుతూ.సాగుతూ.
అసలే శ్రావణం. పడుతుందో లేదో తెలియని వాన. తెల్లవారుఝాము నాలుగున్నరకంతా..బడికి చేరక పోయామా..ఇక అంతే.
రాని వాళ్ళను వదిలేసి వచ్చిన వారు చక్కా  బయలుదేరి పోయే వారు.

బాయిలర్ వెలిగించి, నీటిని మరిగించి  ,స్నానపానాదులు ముగించుకోవడం ఒక ఎత్తు.
చిక్కులు తీసుకొని జడలేసుకొని రిబ్బన్లు ముడేయడం మరొక ఎత్తు.
వ్యాక్స్ పాలీషు తీసుకొని .. చేతికి అంటకుండా .. వంటికో బట్టలకో కాక బూట్లకే  రుద్దుకొని  సిద్ధం చేసుకోవడం మరొక కార్యక్రమం.
ఇక, సాగిపోయిన సాక్సులు ,బొటనవేలు కిటీకీలున్న సాక్సులను వెతికి అప్ట్టుకొని..వాటిని చక చక సూదీదారాలకు అప్పజెప్పి .. చక్కగా ఉతికి ఆరేసుకొని .. మడతేసుని.. దాచి ఉంచుకోవడం మరో ఎత్తు.
ఇక, అన్నిటినీ ధరించి..బడికి పరిగెత్తుకు పోదామంటే .. ఊరుకోవు కదా  వీధి కుక్కలు !

సమయానికి చేరామా సరే.
లేకుంటే, సందులో లోంచి ప్రభాత్ ఫేరీ వెళ్ళెప్పుడో చప్పుడు చేయకుండా దూరేయచ్చు.
కానీ, మా సార్లకు టీచర్లకు నిలువెల్లా కళ్ళే! చెవి మెలిపెట్టి , వరసల్లో సాగుతున్న వారి ఆవల పక్కనో , అందరికన్న వెనగ్గానో నడవమనడమే...కాకుండా..
  ప్రభాత్ ఫేరీ కి ఆలస్యం చేసినదేశ ద్రోహి”గా కట్టిన పట్టంతో , మరొక ఏడాది బడిలో తల వాల్చుకొని తిరగాల్సి వచ్చేది. అంతటి ప్రమాదం ఎవరు కొని తెచ్చుకొంటారు  మీరే చెప్పండి?
మేం మా శక్తి కొద్దీ కాళ్ళను నేల మీద ధనధనలాడిస్తూ  వరసగా నడుస్తూ పోతుంటే ,వాకిట్లో నిలబడి పిల్లాపాప తల్లీ  తండ్రీ ..ముసలీముతకా ..వాకిళ్ళలో నిలబడి ముచ్చటగ చూస్తుండేవారు
మెటికలు విరిచేవారు మెటికలు విరిచేరా.. చేతులు ఊపేవారు చేతులు ఊపేరా ..!

వీధిలోకి వెళితే వీధిలో.
"కదం బడాతే జాయింగే ..ఖుషీకే గీత్ గాయెంగే !".. పాలమూరు మా గొంతులతో హోరెత్తిపోయేది.
మా  బడి పిల్లల్లో ఎవరన్నా ఇంటి ముందుగా సాగేటప్పుడు . మరింత గొంతు పెంచి పెంచి జయకారాలు చేసే వాళ్ళం. అలాంటటప్పుడు, ఇంటి వారూ వంత పాడే వారు.
ఒక్కో మారు వేరే బడి పిల్లలు మాకు ఎదురొచ్చేవారుఅప్పుడు చూడాలి.  “మీరా మేమా “అని . చేతుల్లో ఎవరికి వాళ్ళం తయారు చేసుకొన్న కాగితం జెండాలను గాల్లోకి  ఎత్తి ...మా గుట్టలు పిక్కటిల్లేలా జై జై రావాలు చేసే వారంఅటూ ఇటూ పంతుళ్ళు పోటీలు పడి మరి మాతో పాటలు పాడించే వారు.
ఇంతలో పొద్దు ఎర్రబడ్డం చూసీ చూడగానే మా ప్రభాత్ ఫేరీ బడి దారి పట్టేది.
సూర్యోదయం అయ్యే సమయానికి తిరగవలసిన వీధులన్నీ తిరిగేసి.పాడవలసిన పాటలన్నీ పాడేసి.. పెనునిద్దరలన్నీ వదిలించేసి...బిల బిల మంటూ బడికి తిరిగివచ్చేవారం .
అప్పటికంతా  తయారు.
అసలు చేయవలిసిన పనతా ముందురోజే చేశేసాం కదా?
రంగుల రంగుల కాగితాలాన్నిత్రిభుజాల్లా కత్తిరంచి ..పురికొసల మీద జిగురుతో అంటించి ..బడి ఆవరణంతా తోరణాల్లా వేలాడేసే వారు.పిల్లలు పంతుళ్ళూ పంతులమ్మలూ తలా చేయేసి.
మా మట్టుకు మేం తరగతి గదిని బూజులు కొట్టి ఊడ్చి , బోర్డును పిచ్చిబీరాకుతో తెగ రుద్ది నలుపు చేసి...గదంతా రంగు కాగితం త్రిభుజాలతో  అలంకరించి.. మంచి మాటల అట్టలను గోడ మీదకు ఎక్కించి...మా గదిని తనివి తీరా అలంకరించుకొనే వాళ్ళం. కాగితాలు , మైదాపిండి కొనడానికి తలాకాస్త చందా వేసుకొనే వాళ్ళం. పదిపైసలనుచి రూపాయ దాక.ఎవరికి తోచినంత వారు.
మైదా పిండిని ఉడకబెట్టి జిగురు తయారు చేసుకొనే వారం.

కాగితం రిబ్బన్లను మెలి తిప్పి వరుసలు వరుసలు గా వేలాడేసే వారం.
మిగిలిన డబుల్తో పిప్పరమెంట్లో చాక్లెట్లో కొనుక్కొనే వారం. ఇవి మాకు పండగ
స్పెషల్ అన్న మాట!ఇక , జెంఢాకర్ర చుట్టూ ముగ్గులేసే వారు ముగ్గులేసారా.. రంగులు నింపేవారు రంగులు నింపారా..పూలతో అలంకరించేవారు అలంకరించారా.. అబ్బబ్బో !
అటు సూర్యో దయం అయిందో లేదో .. ఇటు జెంధావందనం అయిందన్నమాట!
రెప రెపలాడే జంఢా లో ముడిచి ఉంచిన పూలరేకులు గాలివాటున మా ముఖాలను తాకినప్పుడు చూడాలి.. ఎంత బావుండేదో!
 జనగణమని  ఊరంతా హోరెత్తి పోయేది  ఆ క్షణాన.
జెంఢా ఊంఛా రహే హమారాఅంటూ గొంతెత్తి పాడే దేశభక్తి గీతాలు,పెద్దలు పిల్లలకు నాలుగు మంచి మాటలు చెప్పాక.. అసలు కార్యక్రమం.
తీపిబూందీనో కోవాబిళ్ళో .. కారబ్బూందీ పాటు ..పిల్లలందరికీ.అందినవి అందినట్లుగా గుప్పిట్లో  చిక్కించుకొని ,
పటుకుపటుకు మనిపిస్తూ...   పకపక లాడుతూ   ఇంటి దారి పట్టే వాళ్ళం.
వచ్చే ఏడాది జెండాపండగ కోసం ఎదురు చూపులు మొదలు పెడుతూ.
***
మా బడిలో స్కౌట్స్ అండ్ గైడ్స్  కార్యక్రమం మొదలు పెట్టగానే , మా తరగతి నుంచి  మేమందరం చేరాం.
అయితే మాకెప్పుడూ జెండా పట్టుకుని నడిచే అవకాశం రాలేదు. ఆ పనిని ఎప్పుడూ పెద్దతరగతుల పిల్లలే చేసేవారు.
మాదెప్పుడూ వెనక వరసే.
" మనమెప్పుడు అలా జెండా పట్టుకుని ముందుకు నడుస్తామా "అని అనుకునే వాళ్ళం.
 చివరికి ఆ రోజు రానే వచ్చింది. అప్పుడు కానీ తెలియలా.అదెంత ముఖ్యమైన పనో.
నిటారుగా నిలబడాలి. పై నుంచి జెంఢా బరువు.
అటూ ఇటూ ఏ కాస్త తొట్రుపడినా  ,జెంఢా వొరుగుతుంది.
చేయి వొణికినా జెండా చేజారుతుంది. జెండా నేలకంటకూడదు కదా?
అప్పుడనిపించింది,
" వెనక వాళ్ళు చూడు ఎంత హాయిగా చేతులూపుకుంటూ నడుస్తున్నారో "అని !
***
అనకూడదు కానీ ,
జెండాపండగలోని సరదా , సంతోషం  సరిగ్గా ఎప్పుడు ఎలా తగ్గిపోయిందో తెలియనే తెలియ లేదు.
ఏర్పాట్లలోని సంఘీభావం ,ఉపన్యాసాలలోని ఉత్తేజం క్రమేణా తగ్గుతూ వచ్చాయి.
 సొర్యోదయాన కాక అథిదోదయానా జెంఢావందం కాసాగింది.ఉపన్యాసాలు ఊక దంపుళ్ళయాయి.
వారి మాటలు మాకు రూపేణ మార్గదర్షకత్వం అవుతాయన్న స్పృహ వారిలో దాదాపు మృగ్యం.
 ఊళ్ళొని పిల్లలందరినీ అట్టహాసం గా ఒకచోట జమచేసి
వారితో బృందనాట్యాలు, క్రీడావిన్యాసాలు,మార్చ్ పాస్టులు ,అతిధి వందనాలు.. పరిపాటి అయ్యాయి.
రావలసిన అతిధులు ఏనాడు సమయానికి వచ్హిన ఆనవాళ్ళు లేవు
ఆలస్యంగా మొదలయ్యి ఏ మిట్టమధ్యాహ్నానికో కార్యక్రమాలు పూర్తయ్యేవి.
ఇంతా చేసి అతిథులు అంతా చూసేవారే కారు.
 ఆ దరిమిలా , ఎర్రటి ఎండలో జెంఢా వందనం ..ఎన్ని మార్లు చేసామో!
తెల్లవారే ఇళ్ళల్లో బయలు దేరి ..తినీ తినక.. హడావుడిగా అక్కడికి చేరిన... చేర్చబడిన....  మాబోటి పిల్లలలం..సరిగ్గా ఇలాంటి స్వాతంత్రదినోత్సవాల్లోనే గా స్వతంత్రం కోల్పోయాం!
కలం పట్టిన కొత్తల్లో కరకర లాడుతూ ..ఆనాటి అనుభవాల్ని "బాలల దినం " పేరిట 'అచ్చ'రబద్దం చేసేందుకు ప్రయత్నించా .
ఎందుకంటే, అలాంటి అనేక కార్యక్రమాల్లో ఎందరు పిల్లలు  గంటల తరబడి  ఎదురుచూపులు చూస్తూ ..నిటారుగా నిలబడలేక..కళ్ళు బైర్లు కమ్మి .. స్పృహ తప్పి ఉంటారో!
***
మనుషుల్ని ముక్కలు ముక్కలుగా చూపుతూ ..
కరి పట్ల ఒకరు అపనమ్మకంతో జీవిస్తూ.. 
ఒకరిపై ఒకరికి ద్వేషభావనను రగిలిస్తూ...
ఒకరిని చూసి ఒకరు ఉలిక్కి పడే అభద్రతాభావం అంతకంతకూ పెరుగుతున్నప్పుడు....
పిల్లల్లో వారి చుట్టూ ఉన్న పెద్దల్లో ..
కులమత ప్రస్తావన లేకుండా..దేశం యావత్తు జరుపుకొనే జాతీయ పండగను .. 
భావిభారత పౌరులుగా  వారిలో ... జాతీయ భావన ను స్పూర్తినీ స్పందనను ..కలిగించ గల కార్యక్రమాలుగా మనం ఎలా మార్చుకోగలం? ఎలా మలుచుకోగలం?
 ప్రపంచీకరణ, స్థానిక వాదన నడుమ దేశకాలసీమితమైన సార్వజనీన జాతీయభావన ఒకటి ఉందనీ, దానిని మనం పదిలపరుచుకోవాలనీ .. పూటైనా మనం జ్ఞప్తికి చేసుకోవద్దూ?
స్వేచ్చకూ సమతకూ మూలమైన సౌభ్రాతృత్వ భావనకు బలమైన పునాది బడిలోనే పడుతుందనీ..
అందుకు ఇలాంటి పండగ పూట ఒక ఆహ్లాదమైన ఆవరణ కాగలదీ మనం గ్రహించ వద్దూ?
ఇదొక  ప్రహసనం కాదనీ ప్రత్యేకమైన సందర్భమనీ .. మనం అర్ధం చేసుకోవద్దూ?
ఇవీ అవీ .. అన్నో ఎన్నో  ... మనం తెలుసుకొని మన పిల్లలకు తెలియ పరచ వద్దూ?
*
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
***
 All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Aug 11, 2010

పిల్లల కలాలు

క్రమం తప్పక ప్రతి ఏడాదీ కొత్తగూడెం క్లబ్ నిర్వహణలో జరిగే బాలోత్సవ్...ఒక పిల్లల పండగ.
అందులో కథ చెప్పడం,రాయడం, విశ్లేషించడం ఒక ముఖ్యమైన భాగం.

గతఏడాది జరిగిన కథారచన కు ముందు, పిల్లలతో .. వోల్గా, వాసిరెడ్డి నవీన్, శిరంషెట్టి కాంతారావు,అక్కినేని కుటుంబరావు,భగవాన్, చంద్రలత, ముళ్ళపూడి సుబ్బారావు  తదితరులు మట్లాడారు.
కథారచనలోని మెళుకువల గురించి.విషయనేపధ్యాల గురించి. భాష గురించి. అనేకానేకం.

సుమారు వందకు పైగా కథకులు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందులో కొన్ని రచనలను ఇకపై వరసగా మీరు చదవ వచ్చును.
 ఇవి పిల్లల రచనలు. మీ అభిప్రాయాలు సూచనలు వారిని కలాలను మెరుగు పరచడానికి ఎంతైనా మార్గదర్శకాలు కాగలవు.ధన్యవాదాలు.
అందులో ఈ అద్బుతశక్తులు

http://prabhavabooks.blogspot.com/2010/08/blog-post_11.html
అన్న  రచన మొదటిది .
వీటినీ, మరి కొన్ని చిట్టి రచనలనూ ఇక్కడ చదవ వచ్చును.
http://prabhavabooks.blogspot.com/


శిరంషెట్టి కాంతారావు,వాసిరెడ్డి నవీన్, వోల్గా, అక్కినేని కుటుంబరావు  గారలు  మరియు  చంద్రల


***
డా. వాసిరెడ్డి రమేష్ గారు మరియు ఇతర పిల్లల శ్రేయోభిలాషులు, కొత్తగూడెం క్లబ్,కొత్తగూడెం వారికి నమస్సులతో ***.

 All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Aug 5, 2010

ఎదురు దెబ్బలు

http://www.eenadu.net/vasundhara.asp?qry=bala

ఇవ్వాళ్టి వసుంధరలో అచ్చయినది అచ్చవగా మిగిలినది ఇక్కడ చదవ గలరు.
ప్రశ్నలు వారివి. స్పందనలు నావి.



Aug 4 (1 day ago)
pillallo monditanam tagginchadantiki vallalni kottadam sarina panena?
పిల్లలు మొండి వాళ్ళుగా పిలవబడుతున్నారంటేనే , అప్పటికే  వారి సున్నితత్వానికి ఎదురుదెబ్బలు బాగానే తగిలాయన్న మాట!
అందరు పిల్లలు ఒక్కలాగానే ఉన్నా ప్రతి ఒక్కరు ఒక ప్రత్యేకమైన నేపధ్యాలలో పెరుగుతారు.
ఎవరికి వారు తమ పిల్లలకు మంచి గృహ వాతావరణాన్నే
 అందించాలని ప్రయత్నిస్తుంటారు. అయినప్పటికీ , పిల్లల మొండితనం ,పెద్దల చేతివాటం నిత్యసాదృశ్యాలు.
తెలిసని అనుకొనే  వారు మొక్కై వంగనిది మానై వంగదని చేతికి పని చెపితే ,తెలియని వారు వారి అడుగుజాడల్లో నడుస్తూ ఉంటారు.నిజానికి మునుపటికన్నా పిల్లలపెంపకంలో తల్లిదండ్రులకు అవగాహన పెరిగింది. కాని, నానాటికీ ఇరుకున పడుతున్న నాగరిక దైనందిక జీవితం ఆటుపోట్లకు , కలిగె నిరాశానిస్పృహ లను భరించే క్రమంలోని వత్తిడి,ఆ దరిమిలా రగిలే కోపతాపాలను ..పిల్లలపై గుమ్మరిస్తున్నారు.పిల్లల భవిష్యత్తును గురించిన బెంగ, వారినైపుణ్యాలను తీర్చిదిద్దే ప్రయాస, పిల్లల ఇష్టాఇష్టాలను నియంత్రించే నిరకుశుల్లా మార్చేస్తున్నది.
"పిల్లలు అడిగినవన్నీ తీరిస్తే ఇక అయినట్లే "అని పెదవి విరిచే వాళ్ళొక విషయం గుర్తు ఉంచుకోవాలి.పెద్దలు అడిగినవన్నీ కూడా పిల్లలు తీర్చలేరు.
పెద్దలం కోరినట్లుగా పిల్లలు ఉండాలని శాసిస్తున్నాం. పిల్లలు కోరినట్లుగా పెద్దలు ఉండాలని మనం గ్రహించలేక పోతున్నాం.
పెద్దలం పిల్లల ఎదుగుదలకు సహకరించే వారమే కాని శాసించేవారం కాము. మంచీచెడుల విచక్షణను నేర్పలేక పోయినపుడు , ఆ పెద్దల శిక్షణకు అర్ధం లేదు.విషాదం ఏమంటే , తమకు ఏది ఇష్టమో ,ఏది కాదో తెలియచెప్పలేని స్థితో పిల్లలు ఎదుగుతునారు.
దానికి తోడు, తల్లిదండ్రుల నుండి భయబ్రాంతులు తప్ప స్నేహాభిమానాలు అందక పోతే , మార్గదర్షకులు కావలసిన అమ్మానాన్నలే ,మార్గం మూసేస్తున్నట్లు!
ఇక, పిల్లలు ఉక్కిరిబిక్కిరి కాక ఏమవుతారు? తల్లిడండ్రులపై అభిమానం లేనిదే , సభ్య సామాజికులను ఎలా గౌరవిస్తారు? ఇంటి కలతల మధ్య, చీకాకుల మధ్య తల్లిదండ్రుల అయిష్టతల మధ్యన పెరిగిన ఒక పిల్లవాడు హిట్లర్ కాక మరేమవుతాడు?
అందుచేత, పిల్లలు మొండి వాళ్ళుగా తయారంటే, పెద్దలు తమ ప్రవర్తనను పరీక్షించుకొని , తమ వ్యవహారశైలిని  సరిదిద్దుకొనే ప్రయత్నం చేయాలి ముందు! ఆ తరువాత పిల్లల ప్రవర్తన సహజంగానే ఆ మార్పు ప్రతిఫలిస్తుంది.


sunnitamga valla bhavalani gouravinchadam sadyama?
సాధ్యం.
అమ్మానాన్నలలో పిల్లలను పిల్లలుగా ఎదగానివ్వాలన్న స్పృహ ,చేతనా ఉండాలి. పిల్లలు తమ ఇంటి గారాబు బిడ్డలే కారు సభ్య సామజికులుగా ఎదగ వలసిన వారన్న మౌలిక సత్యాన్ని వారు అనుక్షణం గుర్తుంచుకోవాలి.
అడిగినవన్నీ అవుననడం లేదా  ఔనంటే కాదనడం .. ఇలాంటి ఏకపక్ష వ్యవహారం అభిలషణీయం కాదు.
పిల్లలు సర్వస్వతంత్రులు . వారిని స్వేచ్చగా  ఎదిగే అవకాశాలు కల్పించడం పెద్దల బాధ్యత.. అంతే కాదు, ఆ స్వేచ్చ కు గల పరిమితులను పిల్లలకు అవగాహన అయ్యేట్లు చేయ వలసిందీ  పెద్దలే. అక్కడిక అసాధ్యం అన్న మాటకు తావే లేదు.ప్రయత్న లోపం తప్ప.

could u pls tell me any two examples?
 ఉమ్మడి కుటుంబాలలో ఎదిగిన పిల్లలలో ఒకరు కళ్ళురిమితే మరొకరు చేరదీసే వారు. ఒకరు కోప్పడితే మరొకరు ఎందుకు 
కోపపడవలసి వచ్చిందీ వివరణ ఇచ్చేవారు.
ఇప్పుడు అమ్మానాన్నలే ఈ రెండు బాధ్యతలను నిర్వర్తించాలి. అప్పట్లో ఉన్న తీరిక ఇప్పుడు లేదు.పైనుంచి తలకు తట్టేడు సమస్యలు .వత్తిళ్ళు. సమస్యల్లో ఒక సమస్యగా పిల్లలను భావించే వాళ్లు మనకు తరుచూ కనబడుతుంటారు. 
సమస్య పిల్లలు కారని ,వారిని సమస్యగా భావించే వారేనని మనం గుర్తించాలి. మారుతున్న తరం , వారి అవసరాలు, వత్తిళ్ళు ,సవాళ్ళు ,వాటిని అధిగమించడానికి కావలసిన విచక్షణ  .... పిల్లలకు రావాలంటే , వారిని వారుగా ఎదగనివ్వడమే ఒకే ఒక్క మార్గం!



<వసుంధర" వారికి ధన్యవాదాలతో.>

***

 All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

చదువులలోని సారమెల్లా

మధ్య రాసిన "ఆవర్జా " అనే కథలో విధీశ అనే పాత్ర ఇలా అనుకుంటూ ఉంటుంది.

నేనంటే.. నా ఆలోచనా?
కాదు!
నేనంటే ... నా ప్రతిభా?
కానే కాదు!!
నేనంటే...???
నా లౌక్యం ..!!!
ఇదీ రోజటి సత్యం !"                                                                   (ఆవర్జా", ఇదం శరీరం సంపుటి,2002)
అదండీ అసలు సంగతి !
లౌక్యం నేర్పడానికే చదువు , అదే ఇవ్వాళ మన విద్యావ్యవస్తలో ప్రధాన వినియోగవస్తువు!
ఎందుకంటే,పిల్లలు చదువుకోవాలి. బ్రతుకుతెరువు కోసం. చక్కటి భవిష్యత్తు కోశం.. మనకు మరో మార్గం లేదు.
అందుకే, మనం ఎంతో నిజాయితీగా వెతుకుతున్నాం. పిల్లలు ఏఏ డిగ్రీలు స్వంతం చేసుకొంటే ...పెద్దయ్యాక సుఖంగా జీవించగలుగుతారు  అని ..అన్ని వైపులా అన్వేషిస్తున్నాం. ఎన్నెన్ని  డిగ్రీలు వారు స్వంతం చేసుకొంటే ..అంత సంతోషిస్తున్నాం. లౌక్యుడు అయ్యాడనీ ఆనందపడుతున్నాం.
క్రమంలో మనకు తెలిసిన ఒక చిన్న విషయాన్ని మరిచి పోతున్నాం.
లౌక్యం స్వార్ధానికి మూలం. స్వార్ధం అన్ని అమానుషాలకు కేంద్రం .
అహాన్ని పెంచే స్వార్ధాన్ని నింపే - చదువు గురించి - మన వేమన వేసిన చురకను మరిచిపోగలమా ? విద్యచేత విర్ర వీగువారు పసిడిగల్గు వాని బానిస కొడుకులు ..అంటూ.
నిజమే.
వినయాన్ని ఇవ్వని విద్య ,స్వేచ్చను హరించే విద్య... మనకు సరి పోతుందా?
చదువు ఎలా  ఉండాలంటే -
పసిడి కొరకు బానిసలుగా మార్చేది మాత్రం కాదు .
మనలోని పసితనాన్ని పచ్చ బరిచి ఉంచేదిగా ఉండాలి.
*
  
"చదువులలోని సారమెల్లా చదివి" మనం ఒక లక్ష్యం ఏర్పరుచుకొన్నాం. దాని వైపే మనం ప్రయాణం సాగిస్తున్నాం. అది- స్వేచ్చ ,సమత,సౌబ్రాతృత్వం తో నిండిన మరో ప్రపంచం.
ఎన్నెన్నో మార్గాలను మనం నిర్మించుకొంటూ వస్తున్నాం.
అందులో -పిల్లల చదువు ఒక సచేతనా మార్గం -అని మనం భావిస్తున్నాం.
మన చుట్టూ ఒక స్తబ్దత చుట్టేసి ఉంది.
మనలోని సున్నితత్వాన్ని కోల్పోతూ వస్తున్నాం.
కరుడు కట్టి పోతున్నాం.చట్రాలలోకి ముడుచుకుపోతున్నాం.జిజ్ఞాస , రసజ్ఞత కొరవడిన ఒక నిర్లిప్తభరిత జీవితాన్ని నెట్టుకొస్తున్నాం.
ఆదర్శ ప్రపంచం ఒక బలమైన ప్రేరణగా లక్ష్యంగా - ఎందుకని ఆకర్షించ లేక పోతుంది?
బహుశా మన లో  సామాజిక స్పృహ,చేతన,దృక్పథంతో పాటుగా ..సామాజిక ఆర్ద్రత కావాలేమో ..
నిజమే,
ప్రేమ ,కారుణ్యభావం ,మంచితనం.. మనల్ని మనుషులుగా చేస్తుంది.
చదువు ఎలాఉండాలంటే -
నేనొక మనిషిలా పరివర్తన చెందేలా!

(26-1-07,వికాసవనం, విజయవాడ,ప్రసంగ పాఠం నుంచి మరికొంత    )



***
 All rights @ writer. Title,labels, postings and related copyright reserved.