Feb 15, 2015

వినబోతూ రుచెందుకూ.. ?

మట్టిలో మాణిక్యాలు దొరుకుతాయి అన్న  మాట నిజమని  మరొక సారి నిరూపించింది క్రియ బాలోత్సవ్ 2015
 నక్కా అనిత ఆరో తరగతి అమ్మాయి . పురకట్ల పల్లి  జిల్లా ప్రజా పరిషత్ ఓరియెంటల్ హై స్కూల్  లో చదువుతోంది. వాళ్ళ అక్క మౌనిక ఈ ఏడాదే బడి వదిలి, కాలేజీలో చేరింది. అక్క నేర్పిన  పాటను అనిత హృద్యంగా పాడి , అందరినీ కొల్లగొట్టేసింది.
 "బువ్వ పెట్టి బుజ్జగించే ఆ తల్లి లాలనకు దూరామా..." అంటూ.
అనిత తండ్రి ,నక్కా వెంకట రత్నం ,ఒక తాపీ మేస్త్రి. తల్లి, నాగమణి ఒక దినసరి కూలీ. ముగ్గురూ ఆడపిల్లలు. "మరి చదివిస్తారా ? "
"ఆయ్  .. ఆళ్ళు సదుకుంటే సదివించేడవేనండీ.."అని అన్నారాయన. 
ఆ  పిల్లలకు శుభాన్ని కోరుకొంటూ..పరిచయం చేస్తున్నా... ఆ ప్రతిభ పది కాలాలు పదిలం పదిలం అనుకొంటూ.


వినబోతూ రుచెందుకూ.. ?
ఆ మాధుర్యాన్ని మీరే ఆస్వాదించండి. ఆ చిన్నారులిద్దరినీ ఆదరంతో అభిమానంతో తలుచుకోవడం.. మరవకండి !

https://www.youtube.com/watch?v=DdKrakNam84&feature=youtu.be




All rights @ writer. Title,labels, postings and related copyright reserved.